ఓటమి తర్వాత వల్లభనేని వంశీ సంచలన ప్రకటన చేశారు. గన్నవరం నాలుగు మండలాల్లో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా గత పదేళ్ళుగా పోలవరం కుడికాల్వపై నా సొంత ఖర్చులతో 500 మోటార్లు ఏర్పాటు చేసానని వెల్లడించారు వల్లభనేని వంశీ. వీటి ద్వారానే పట్టిసీమ నీటిని పంట పొలాలకు, చెరువులకు మళ్ళించడం జరిగిందన్నారు. గతంలో మాదిరిగానే రైతులు, రైతు నాయకులు కమిటీలుగా ఏర్పడి యథావిధిగా పట్టిసీమ నీటిని పంట పొలాలు, చెరువులకు మళ్ళించేందుకు వీలుగా మోటార్లను ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానని వివరించారు.