BREAKING: కాల్పుల్లో ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌ కన్నుమూత

59చూసినవారు
BREAKING: కాల్పుల్లో ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌ కన్నుమూత
ముంబైలో శనివారం ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌పై గుర్తు తెలియని తుపాకీతో కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. బాబా సిద్ధిక్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మహారాష్ట్ర మాజీ మంత్రిగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్