BSP చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు..ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

66చూసినవారు
BSP చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు..ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్మ్ స్ట్రాంగ్ మర్డర్ కేసులో కీలక నిందితుడైన రౌడీషీటర్ తిరువేంగఠం పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఈ కేసులో నిందితుడైన తిరువేంగఠంను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా తిరువేంగఠం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్