టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్,
ఆస్ట్రేలియా దేశాలపై అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఇప్పటికే రెండో స్థానంలో ఉన్న జహీర్ ఖాన్ సరసన చేరాడు. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఏడుసార్లు ఈ ఘనత సాధించగా, బుమ్రా, జహీర్ చెరో ఆరుసార్లు ఈ ఫీట్ అందుకున్నారు.