ఈ ఆలయానికి వెళ్లి పూజిస్తే
వీసా దొరుకుతుందని చాలా మంది భక్తులు నమ్ముతారు. అదే పంజాబ్లోని హవాయూ జహాజ్ గురుద్వారా. పంజాబ్లోని జలంధర్ తల్హాన్లో ఉందీ ఆలయం. ఇందులో దైవానికి వీసాదేవుడని పేరు కూడా పెట్టి ఆలయంలో పూజలు చేస్తున్నారు. అక్కడ భక్తులు బొమ్మ విమానాలనే కానుకలుగా సమర్పించుకుంటారు. ఒకప్పుడు షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారాగా పిలిచే ఈ సిక్కు ఆలయాన్ని ప్రస్తుతం హవాయూ జహాజ్ గురుద్వారాగా పిలుస్తున్నారు.