తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు కండక్టర్పై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. ఓ మహిళా ప్రయాణికురాలు తాను దిగాల్సిన స్టాప్ కంటే కొంచెం ముందుకు వెళ్లి బస్సు ఆగిపోవడంతో వివాదం మొదలైంది. అనంతరం బస్సు తిరిగి వస్తుండగా ఆమె కుటుంబసభ్యులు ఐదుగురు లోపలికి వెళ్లి కండక్టర్ను తీవ్రంగా కొట్టారు. మహిళా ప్రయాణికులు అతడిని రక్షించారు. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.