లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి(వీడియో)

71చూసినవారు
మహారాష్ట్రలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతికి సమీపంలోని మేలేఘాట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరి కొందరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు అమరావతి నుంచి ధరణి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్