దివాలా స్థితిలో ఉన్న ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్కు మరో షాక్ తగిలింది. స్పాన్సర్షిప్కు సంబంధించి రూ.160 కోట్లు చెల్లించలేదని బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ స్పందించింది. ఈమేరకు సంస్థ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు పంకజ్ శ్రీవాస్తవ అనే అధికారిని ఇంటర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్గా ఎన్సీఎల్టీ నియమించింది. ఈ చర్యతో సీఈఓ రవీంద్రన్, బోర్డు డైరెక్టర్లు సంస్థలో తమ అధికారం కోల్పోయే అవకాశం ఉంది.