ఏజెంట్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్ జిల్లా మహిళ.. సెల్ఫీ వీడియో

82చూసినవారు
ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ.. ఏజెంట్ చేతిలో మోసపోయింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దేవి అనే మహిళ ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో షేర్ చేసింది. థామస్ అనే ఏజెంట్ తనని కువైట్ పంపిస్తానని చెప్పి, మస్కట్ పంపించాడని వెల్లడించింది. అక్కడ యజమాని వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురయ్యానని తెలిపింది. తిరిగి ఇండియాకి పంపించమని అడిగితే ఏజెంట్ రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పేర్కొంది.

సంబంధిత పోస్ట్