సందేశ్ఖాలీ హింస కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కోర్టు కొట్టివేసింది. ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ అరెస్ట్ ఎందుకు ఆలస్యమయిందని సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జనవరి 5న సందేశ్ఖాలీలోని షాజహాన్ ఇంటిలో ఈడీ సోదాలకు వెళ్లగా.. ఆయన అనుచరులు అధికారులపై దాడి చేశారు.