యూకే రాజధాని లండన్లో మహిళల్లో వచ్చే క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లండన్లోని స్లవ్ ప్రాంతంలో.. ప్రవాస భారతీయులు స్థాపించిన ‘బెర్క్షైర్ భారత్ కమ్యూనిటీ’ అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. మార్చి నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఈవెంట్ను నిర్వహించారు. దీని ద్వారా £1,655 పౌండ్లను (సుమారు రూ.1.70 లక్షలు) ఒవేరియన్ క్యాన్సర్ యాక్షన్’ అనే ఛారిటీకి అందజేశామన్నారు.