పంజాబ్లోని ముక్త్సర్లో ఆదివారం రోడ్డు పక్కన నిల్చొన్న వృద్ధ దంపతుల మీదకు కారు దూసుకెళ్లింది. దీంతో ఆ వృద్ధ జంట గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత కారును వదిలి డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.