పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఈసీ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కలెక్టర్లతో సీఎస్ జవహర్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు కాన్ఫరెన్స్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా వారంలో పెన్షన్లు ఇవ్వొచ్చని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని పేర్కొన్నారు.