‘మహేంద్ర సింగ్ ధోనీ’.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్కి పూనకాలే. వైజాగ్ వేదికగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోనీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతడి కోసమే మ్యాచ్కు వచ్చామా? అన్నట్లుగా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి బ్యాటింగ్కు దిగిన ధోనీ అభిమానులను అలరించేలా ఆడాడు. ఈ క్రమంలో వైజాగ్ స్టేడియంలో ధోనీ ఎంట్రీ నుంచి అతడి బ్యాటింగ్ వరకు స్పెషల్ వీడియోను ఐపీఎల్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.