మంటల్లో దగ్ధమైన కారు.. తప్పిన ప్రమాదం

71చూసినవారు
మంటల్లో దగ్ధమైన కారు.. తప్పిన ప్రమాదం
జగిత్యాల జిల్లాలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. కథలాపూర్ మండలం పోసానిపేట వద్ద కారులో నుంచి పొగలు వచ్చి నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన భక్తులు వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్