అధికారంలోకి రాగానే కులగణన: రాహుల్ గాంధీ

53చూసినవారు
అధికారంలోకి రాగానే కులగణన: రాహుల్ గాంధీ
లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి అధికారం చేపడితే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని షహీద్ మైదాన్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీ హయాంలో దళితులు, గిరిజనులు కార్మికులుగా మారారని అన్నారు. జార్ఖండ్ సీఎం గిరిజనుడే కావడంతో ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.