గుజరాత్లోని వడోదరలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్లో సాంబార్ గిన్నె(కెటిల్) నుంచి గొంగళి పరుగులు బయటకు వచ్చాయి. వీటిని చూసిన కస్టమర్లు కంగుతిన్నారు. వడోదరకు చెందిన గణేష్ ఫ్యాన్సీ దోస సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సాంబార్ కెటిల్ నుంచి గొంగళి పురుగులు వస్తుండగా కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.