పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు

53చూసినవారు
పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఆహ్వానం మేరకు చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ప్రతిపాదనలపై అధికారులు సీఎంకు ప్రజంటేషన్‌ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్