లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సంధర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలోని న్యూ మోతీ బాగ్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. "నేను మొదటిసారి ఓటు వేసినప్పుడు, నేను మా నాన్నతో వెళ్ళాను, ఇవాళ ఆయనకు 95 సంవత్సరాలు, ఈ రోజు నాతో పాటు ఆయన ఓటు వేశారన్నారు. ఓటరు తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.