నేడు ఆరో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ తన భార్య సుదేశ్ ధన్ఖర్తో కలిసి ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా ఓటువేశారు.