ఎక్కువగా పిల్లల్లో కనిపించే టైప్-1 మధుమేహం ప్రమాదకరంగా మారుతోంది. దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా ఈ బాధితులు ఉన్నారు. గ్లోబల్ టైప్-1 డయాబెటిక్ ఇండెక్స్ ప్రకారం భారత్లో టైప్-2 మధుమేహ రోగుల్లో సగటున 4.4 శాతం పెరుగుదల ఉండగా, టైప్-1 వారిలో పెరుగుదల 6.7 శాతంగా ఉంది. టైప్-2 వారి కంటే టైప్-1 రోగుల పెరుగుదల 2.3 శాతం అధికం. అలాగే యూకేలో 3.5, యూఎస్ఏలో 2.9 శాతం మేర ఏటా టైప్-1 కేసుల పెరుగుదల ఉంది.