కొమురవెల్లికి భక్తుల తాకిడి

81చూసినవారు
కొమురవెల్లికి భక్తుల తాకిడి
TG: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న క్షేత్రానికి 15వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీశర్మ తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :