AP: కళియుగ వైకుంఠం తిరుమలలో భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయం, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో వాన పడింది. తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం కలిగింది. మరోవైపు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో మామిడి, వరి పంటలకు నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.