ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలో సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన రోడ్ షోలో యోగి పాలనలో మార్కుగా నిలిచిన బుల్డోజర్లు కూడా పాల్గొన్నాయి. ములాయం సింగ్ యాదవ్ స్వస్థలమైన మెయిన్పురిలో బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్కు మద్దతుగా యోగి రోడ్ షో నిర్వహించారు. సుమారు పద్నాలుగు బుల్డోజర్లు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నాయి.