ఇకపై పోలీసుల నిఘాలోనే సీఎం జగన్ ఎన్నికల యాత్ర

1528చూసినవారు
ఇకపై పోలీసుల నిఘాలోనే సీఎం జగన్ ఎన్నికల యాత్ర
సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సెక్యూరిటీలో మర్పులు, చేర్పులు చేస్తూ భారీగా భద్రతను పెంచారు. ప్రస్తుత మూడంచెల భద్రతకు అదనపు సెక్యూరిటీని కేటాయించారు. జగన్ బస్సు యాత్ర మార్గాల్లో సీనియర్ DSPలతో నిఘా పెట్టనున్నారు. పర్యటన మార్గాలను సెక్టార్ల వారీగా విభజించి.. సెక్టార్కు ఒక DSP, ఇద్దరు సీఐలు, నలుగురు SIలు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు.