తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. రక్షణ భూముల బదలాయింపుపై రాజ్నాథ్ సింగ్కు రేవంత్ రెడ్డి విజ్ఞాపనలు ఇవ్వనున్నారు. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని సీఎం కోరనున్నారు.