కేంద్రానికి సీఎం స్టాలిన్ లేఖ

50చూసినవారు
కేంద్రానికి సీఎం స్టాలిన్ లేఖ
శ్రీలంక అరెస్ట్ చేసిన భారత జాలర్లను, వారి బోట్లను విడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు. బుధవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు. పుదుకోట్టై జిల్లాలోని కొట్టైపట్టినం ఫిషింగ్ హార్బర్ నుండి బయలుదేరిన నలుగురు మత్స్యకారులను మంగళవారం లంక నేవీ పట్టుకుందన్నారు. ఇటువంటి సంఘటనలు మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించడమే కాకుండా భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు.