14 ఏళ్ల తర్వాత ఇక్కడకు వచ్చా.. నా స్వస్థలానికి వచ్చినట్లు అనిపిస్తోంది: రామ్‌చరణ్‌

82చూసినవారు
14 ఏళ్ల తర్వాత ఇక్కడకు వచ్చా.. నా స్వస్థలానికి వచ్చినట్లు అనిపిస్తోంది: రామ్‌చరణ్‌
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ‘ది ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’కు గౌరవ అతిథిగా రామ్‌చరణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చరణ్‌ మాట్లాడుతూ ‘‘14 ఏళ్ల క్రితం ‘ఆరెంజ్‌’ సినిమా కోసం ఇక్కడికి వచ్చాను. 30 రోజుల షూటింగ్‌ పూర్తై భారత్‌కు వెళ్ళేటప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. ఇక్కడి ప్రజల ప్రేమను, ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇండియన్స్‌ ఇక్కడ కనిపిస్తున్నారు. నా హోం టౌన్‌కు వచ్చినట్లు అనిపిస్తోంది." అని అన్నారు.

సంబంధిత పోస్ట్