కౌంటింగ్‌ నిబంధనలపై కాంగ్రెస్ ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన ఈసీ

80చూసినవారు
కౌంటింగ్‌ నిబంధనలపై కాంగ్రెస్ ఆరోపణలు..  క్లారిటీ ఇచ్చిన ఈసీ
కౌంటింగ్‌ నిబంధనలు ఈవీఎంల రిగ్గింగ్‌ కోసమే మార్చారంటూ కాంగ్రెస్‌ నేత అజేయ్‌ మాకెన్‌ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించిన ఢిల్లీ ఈసీ వివరణ ఇచ్చింది. ‘‘అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను ఆర్‌వో, ఏఆర్‌వోల టేబుళ్ల వద్దకు అనుమతించాం’’ అని వెల్లడించింది. దీనిపై స్పందించిన మాకెన్‌.. 'ఇది ఎంతో కీలకమైన వివరణ. మీ రిటర్నింగ్‌ ఆఫీసర్లు నేటి ఉదయం వరకు ఈ విషయంలో అంతసానుకూలంగా లేరు' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్