జలియన్ వాలా బాగ్ ఊచకోతకు కారణమైన బ్రిటిష్ అధికారులను శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. 1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించడానికి నాటి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1961లో ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్థూపం ఆవిష్కరించబడింది.