భారత ప్రజల్లో రగులుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తియైన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్ కమిటీ అంటారు. బ్రిటీష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. దీంతో ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో సమావేశం జరిగింది.