కాంగ్రెస్, బీఆర్ఎస్ లను అవినీతి కలుపుతోంది: మోడీ

81చూసినవారు
కాంగ్రెస్, బీఆర్ఎస్ లను అవినీతి కలుపుతోంది: మోడీ
వేములవాడ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లను అవినీతి కలుపుతోందన్నారు. ఆ పార్టీల భారి నుండి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని, మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్దమయారన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని ధీమా వ్యక్తం చేశారు.