తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 78,686 మంది భక్తులు దర్శించుకోగా, 37,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.