కరెంట్ అఫైర్స్: దేశంలోనే మొట్టమొదటి పోలీస్ డ్రోన్ యూనిట్

12767చూసినవారు
కరెంట్ అఫైర్స్: దేశంలోనే మొట్టమొదటి పోలీస్ డ్రోన్ యూనిట్
దేశంలోనే మొట్టమొదటి పోలీస్ డ్రోన్ యూనిట్ ను చెన్నైలో ప్రారంభించారు. విస్తారమైన ప్రాంతాలపై వైమానిక నిఘా కోసం, నేర కార్యకలాపాలను త్వరగా గుర్తించడం కోసం ఈ యూనిట్ ను ప్రారంభించారు. ఈ డ్రోన్ల ద్వారా ఏకాంత ప్రదేశాలలో కదలికలను, సంఘ వ్యతిరేక శక్తులను పర్యవేక్షించవచ్చని, రాత్రి వేళల్లో వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించవచ్చని చెన్నై పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ డ్రోన్ లలో ఫేసియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ఉన్నందున నేరస్తులను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్