హర్యానాలోని గురుగ్రామ్లోని ఒక రెస్టారెంట్లో కస్టమర్లకు సోమవారం షాకింగ్ అనుభవం ఎదురైంది. ఐదుగురు కస్టమర్లు భోజనం తిన్న తర్వాత మౌత్ ఫ్రెషనర్ను తీసుకున్నారు. ఆ తర్వాత వారి నోరు మండడంతో పాటు కొద్ది సేపటికే వాంతులు అయ్యాయి. నోటిలో నుంచి రక్తం కూడా వచ్చింది. దీంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్చగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మౌత్ ఫ్రెషనర్లో ప్రాణాంతక యాసిడ్ ఉన్నట్లు తేలింది.