నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పి.నారాయణ అల్లుడు పునీత్పై పన్నుల ఎగవేత కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.కోటికి పైగా నగదు సీజ్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో పునీత్ జీఎస్టీ ఎగొట్టారన్నారు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశాడని, రూ.10.32 కోట్లకు రూ.22 లక్షలు మాత్రమే జీఎస్టీ కట్టారన్నారు.