జమ్ముకాశ్మీర్లోని అక్నూర్లో జరిగిన లోయలో పడ్డ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు తక్షణ సహాయం కింద విడుదల చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.