తాగిన మత్తులో యువత చిత్తవుతున్నారు. తమతో పాటు ఇతరుల జీవితాలను కూడా పణంగా పెడుతున్నారు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం డ్రంకెన్ డ్రైవ్ వల్లే జరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది. దాంతో రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతకు పోలీస్ ఉన్నతాధికారులు పెద్దపీట వేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ అతివేగం, డ్రంకెన్ డ్రైవ్పై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కొందరి వాహనదారుల్లో మార్పు రావడం లేదు.