మద్యం, మత్తు పదార్థాల వల్ల సంభవించే దుష్ఫలితాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలని, పాఠశాలలు, కళాశాలల్లో తరచూ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని వైద్య నిపుణలు పేర్కొంటున్నారు. పోలీసు, విద్యాశాఖలు బాధ్యత తీసుకోవాలి. విద్యాసంస్థల వద్ద బోర్డుల ఏర్పాటుకే అవగాహన పరిమితమైంది. మద్యానికి అలవాటు పడిన వారికి కౌన్సెలింగ్ అవసరమని, మత్తుకు అలవాటుపడిన వారిని సకాలంలో గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పించగలిగితే ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.