ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. అయితే బెయిల్పై ఢిల్లీ హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.