హైదరాబాద్-గుంటూరు- విశాఖ రూట్లో ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఈ రైలును సోమవారం నుంచి ఆగస్టు 11 వరకూ రద్దు చేస్తు్న్నట్లు వెల్లడించారు. తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలును ఆగస్టు 9 వరకూ రద్దు చేశారు. విశాఖ-హైదరాబాద్ వెళ్లాల్సిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ను ఆగస్టు 10 వరకూ రద్దు చేశారు.