భారత్లో డాటా సెంటర్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు ఇక్కడ డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా డాటా సెంటర్ల సామర్థ్యం 950 మెగావాట్లకు చేరుకున్నదని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ తాజాగా వెల్లడించింది. ఆసియా పసిఫిక్ దేశాలైన ఆస్ట్రేలియా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, కొరియా దేశాలను అధిగమించినట్లు అయిందని తెలిపింది.