చిన వెంకన్న క్షేత్రంలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం

57చూసినవారు
చిన వెంకన్న క్షేత్రంలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం
ఏపీలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. నూజివీడు సమీపంలోని దేవరకొండ నుంచి ఆటోలో చిన్న వెంకన్న దర్శనానికి భక్తులు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. దర్శనం అనంతరం శివాలయం ఘాట్ రోడ్ నుంచి ఆటోలో కిందకు దిగుతున్న సమయంలో ఆటో బ్రేక్ ఫెయిల్ అయింది. ఆర్చిగేట్ ముందు షాపు షట్టరును ఢీకొట్టి ఆటో ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో భక్తులు బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్