నేటి నుంచి రాష్ట్రంలో పశుగణన

63చూసినవారు
నేటి నుంచి రాష్ట్రంలో పశుగణన
శుక్రవారం నుంచి ఏపీలో పశుగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. 21వ అఖిల భారత పశుగణనలో భాగంగా నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రంలోని 1.50 కోట్ల కుటుంబాలకు చెందిన పశువుల వివరాలను సేకరించనున్నారు. అలాగే వ్యవసాయ పరికరాల వివరాలనూ నమోదు చేయనున్నారు. పశుసంవర్థక రంగాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే నిధులు, పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పశుసంవర్థక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్