తిరుపతిలో హై అలర్ట్.. హోటళ్లు, విమానానికి బాంబు బెదిరింపులు

56చూసినవారు
తిరుపతిలో హై అలర్ట్.. హోటళ్లు, విమానానికి బాంబు బెదిరింపులు
ఏపీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని ఓ విమానానికి, పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. లీలామహల్‌ సమీపంలోని మూడు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే తనిఖీలు చేపట్టారు. మరోవైపు తిరుపతి విమానాశ్రయంలో స్టార్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్‌5-154 విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్