ముస్లిం మెజారిటీ దేశం పాకిస్థాన్లో తొలిసారి ఓ మహిళకు అరుదైన అవకాశం లభించింది. ఆ దేశ ఆర్మీ మెడికల్ కోర్లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్గా పదోన్నతి పొందారు. పాకిస్థాన్ సైన్యంలో బ్రిగేడియర్ హోదా పొందిన తొలి మహిళ, క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు.