గంగారాంపూర్లోని బమన్శాస్కు చెందిన రాజేంద్ర మీనా (19) రాజస్థాన్లోని కోటాలో మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్కు (NEET) సిద్ధమవుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ కోచింగ్ క్లాస్లకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6న అతడు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో అదృశ్యమయ్యాడు. వెళ్లిపోయేముందు తన తండ్రి జగదీశ్ మీనాకు ‘నేను ఐదేళ్ల పాటు ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను’ అని సందేశం పంపాడని పోలీసులు తెలిపారు. విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.