AP: కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించి, ఏకంగా సీతమ్మ వారికే తాళికట్టారు. చిప్పగిరిలో సీతారాముల కళ్యాణం జరిగింది. సీతమ్మవారికి స్వయంగా ఎమ్మెల్యే విరూపాక్షి తాళికట్టారు. ఈ తథంగాన్ని అడ్డుకోకుండా పండితులు కూడా అక్షింతలు వేశారు. అయితే, పండితులు కట్టమంటేనే తాను తాళిబొట్టు కట్టినట్లు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.