ధరణి దరఖాస్తులు పెండింగ్ పెట్టొద్దు: కలెక్టర్

82చూసినవారు
ధరణి దరఖాస్తులు పెండింగ్ పెట్టొద్దు: కలెక్టర్
ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.విజయేందిర బోయి ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు త్వరగా తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని, గంగాపురం గ్రామాన్ని ఆమె పరిశీలించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాపై స్థానికులతో మాట్లాడి సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.