సంక్రాంతి పండుగ వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవల్లులు అందంగా దర్శనమిస్తాయి. అయితే, హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుళ్లను ఆహ్వానిస్తూ ముగ్గులు వేస్తారని చెబుతారు. ముఖ్యంగా శుక్రవారం పూట మహిళలు ముగ్గులు వేసి పసుసు, కుంకుమతో అలంకరిస్తారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం. కేరళలో ముగ్గుని పూకళం అంటారు. అలాగే, పశ్చిమ బెంగాల్లో అల్పన అంటారు.